హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జూన్ 3వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉదయం 10.30గంటలకు ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. 2014-15 నుంచి 202021 సంవత్సరానికి స్టేట్ ఫైనాన్స్ పై కాగ్ నివేదిక, తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ పనితీరుపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm