హైదరాబాద్ : నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల సందర్భంగా హిందూపురం పట్టణంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర రూ.2లకే నాణ్యమైన భోజనాన్ని అందించే మొబైల్ క్యాంటీన్ను ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మొబైల్ క్యాంటీన్ అందించే భోజనాన్ని ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కిలో బియ్యాన్ని రూ.2లకే అందించారని.. ఆ స్ఫూర్తితోనే రూ.2లకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగే ఏడాది పొడవునా ప్రతి రోజు మధ్యాహ్నం రూ.2లకే భోజనాన్ని అందజేయనున్నట్టు చెప్పారు. టీడీపీ ఎన్నారై విభాగం, బాలకృష్ణ అభిమానులు సంయుక్తంగా ఈ మొబైల్ క్యాంటీన్ను ప్రారంభించారని ఆమె తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 06:28PM