హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న ఓ కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేసి దిగిపోయాడు. అనంతరం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.
Mon Jan 19, 2015 06:51 pm