హైదరాబాద్ : ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయిన మార్గాల్లో అదనంగా ఆర్టీసీ బస్సులను నడపాలని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆ వివరాలను తెలిపారు.
కేశవగిరి నుంచి బోరబండ(9YF) వరకు 22 బస్సులు, సికింద్రాబాద్ నుంచి హైటెక్సిటీ(10H)కి 54 బస్సులు, సికింద్రాబాద్ – బోరబండ(10YF) వరకు 16, సీబీఎస్ చాంద్రాయణగుట్ట నుంచి పటాన్ చెరు(218) వరకు 108, సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరుకు (219) వరకు 84 బస్సులో అందుబాటులో ఉండనున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 07:22PM