విచారణ ప్రారంభించిన సి.ఐ బాలక్రిష్ణ...
ఫోరెన్సిక్ బృందంతో శవ పంచనామా - ఎస్ ఐ అరుణ
నవతెలంగాణ - అశ్వారావుపేట
అనుమానాస్పద స్థితిలో పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు సోమాని శ్రీను(34) శనివారం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎస్.ఐ అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాధమిక విచారణ చేపట్టారు. బంధువుల నుండి పిర్యాదు స్వీకరించి విషయాన్ని ఆమె సి.ఐ బాలక్రిష్ణకు తెలిపారు. అనంతరం పై అధికారుల ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ రప్పించి విచారణ చేపట్టారు.
మృతుడి సోదరుడు రాజా రమేష్ పిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీను తన మిత్రులతో కలిసి హోటల్ లో భోజనం చేసి వస్తానని ఇంటినుండి శుక్రవారం రాత్రి వెళ్ళాడు. మధ్యమధయలో ఫోన్ చేస్తే వస్తున్నా అని రాత్రి 12 గంటలు వరకు చెప్పాడు. 12 తర్వాత అతని ఫోన్ పనిచేయలేదు. కానీ శనివారం ఉదయం తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి 'మీ సోదరుడు శ్రీను అశ్వారావుపేట - సత్తుపల్లి రహదారిలో మీ ఇటుకలు తయారీ ప్రాంతంలో రోడ్డు పక్కన పడి ఉన్నాడు` అని తెలిపారు. దాంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని చూడగా శ్రీను విగత జీవిగా పడి ఉన్నాడు. అయితే అతను మృతి అనుమానంగా ఉంది అని పోలీసులకు పిర్యాదు చేశాడు.
ఇదిలా ఉండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం...సోమాని శ్రీను మరికొందరు తన మిత్రుడు పుట్టిన రోజు వేడుకలను ఇదే రోడ్డులో గల ఒక డాబా లో జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు బర్త్ డే కేక్ కట్ చేసారు. అనంతరం శ్రీనుకి ఫోన్ రావడంతో తాను వెళ్తున్నా తర్వాత మీరు రండి అంటూ నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అనంతరం మిత్రుల్లో ఒకరు ఫోన్ చేయగా ఆఫ్ చేసి ఉన్నది.
ఎస్.ఐ అరుణ తెలిపిన వివరాల ప్రకారం శ్రీను ఫోన్ కి 12 :15 గంటలకు చివరి ఫోన్ కాల్ వచ్చింది.
తర్వాత ఏమి అయింది అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ.ఐ తెలిపారు.
పలువురి నివాళులు
అనుమానాస్పదంగా మృతి చెంది శ్రీను మృతదేహానికి తాజా, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు,తాటి వెంకటేశ్వర్లు,సిపిఐ(ఎం) నాయకులు పుల్లయ్య, ఇతర నాయకులు ఆలపాటి రామ్ మోహన్ రావు,బండి పుల్లా రావులు నివాళులు అర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 08:40PM