హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మాట్లాడుతూ... పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగా బండి సంజయ్ చేతిలో బీజేపీ పార్టీ ఉన్నదని తెలిపారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని.. మసీదులను కూలగొడతామని బండి సంజయ్ మాట్లాడుతున్నారని అన్నారు. శవాలు ఉంటే ముస్లింలవి అంటా.. శివుడు ఉంటే హిందువులవి అంటా... ఉర్దూ భాష కూడా లేకుండా చేస్తారని దారుణంగా మాట్లాడారు అని చెప్పారు. ఇలా మాట్లాడుతూ ఉంటే కనీస చర్యలు కూడా తీసుకోలేదు అని మండిపడ్డారు. రాష్ట్రంలో అగ్గిపెట్టి చలి కాచుకోవాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని, వారికి ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొన్నారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? ఎందుకు బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని నిలదీశారు.
Mon Jan 19, 2015 06:51 pm