ముంబై : మహారాష్ర్టలో తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు శివసేన ప్రయత్నాలు చేస్తోంది. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు శనివారం శాసన సభ ఉప సభాపతి అనర్హత నోటీసులు పంపించారు. సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి రాతపూర్వక వివరణలు సమర్పించాలని ఈ మేరకు ఆదేశించారు. అయితే డిప్యూటీ స్పీకర్ నుంచి నోటీసులు అందిన తర్వాత ఏక్ నాథ్ షిండే తో కూడిన రెబల్ ఎమ్మెల్యేల బృందం గౌహతి లో న్యాయ నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైనట్టు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm