అమరావతి : ఏపీలోనిఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. చంద్రబాబు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత జరిగి మూడేండ్లు అవుతుండటంతో.. నిరసన తెలిపేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజావేదిక వైపు తరలిరాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తొపులాట చోటుచేసుకుంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం అప్పట్లో ప్రజా వేదికను నిర్మించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని అక్రమ కట్టడమంటూ కూల్చేసింది. దీనిపై టీడీపీ అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jun,2022 08:37PM