హైదరాబాద్ : తెలంగాణలో సీఎం కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభమయ్యాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా మార్పు తెచ్చుకుంటే మంచిదని లేదంటే జైలు కెళ్లడం ఖాయమన్నారు. కాళేశ్వరం, యాదాద్రిలో భయంకరమైన అవినీతి జరిగిందని ఆరోపించారు. వీటిపై విచారణ కూడా ప్రారంభమైందని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలో అప్పుల రూపంలో సునామీ వస్తుందని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని ఆమోదిస్తున్నానని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm