విజయవాడ : ఏపీలోని విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్లను పోలీసులు బహిష్కరించారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో రౌడీ షీట్లు నమోదైన బెవర శ్రీను, బాలస్వామి, శ్రీను నాయక్, విజయ్ కుమార్, కట్ల కాళీలను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm