హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకొన్న 821 వాహనాలను వేలం వేయనున్నట్లు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సీజ్ చేయబడిన వాహనాల నెంబర్లు ఇతర వివరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. వేలంపై అభ్యంతరాలున్న వాహన యాజమానులు ధ్రువపత్రాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. వేలానికి సంబంధించిన వివరాల కోసం ఎంటీఓ విష్ణు 9490617317ను సంప్రదించాలని కోరారు.