కామారెడ్డి: జిల్లాలోని పిట్లంలో దుండగులు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి పిట్లంలో ఉన్న ఇండీ క్యాష్ ఏటీఎంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఏటీఎం మిషన్ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. రాత్రి 2 గంటల సమయంలో ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏటీఎం సెంటర్లోని కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎంత డబ్బు పోయిందనే విషయం తెలియాల్సి ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm