నిజామాబాద్: నందిపేట మండలం, లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రాజకీయంగా అడ్డు వస్తున్నారని తన ప్రత్యర్థులు ప్రస్తుత ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ప్రసాద్ రావులను చంపేందుకు ఆయన కుట్ర పన్నారు. 10 లక్షల రూపాయలతో మహారాష్ట్ర గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుపారీ సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm