హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 59,791.32 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సైతం దాదాపు 80 పాయింట్ల పెరిగి 17,783.05 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాలు వీస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం మూడున్నర నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. డౌ జోన్స్ డే కనిష్ఠ స్థాయి నుంచి 150 పాయింట్లు లాభపడగా, నాస్డాక్ దాదాపు 100 పాయింట్ల లాభంతో ముగిసింది. ఆసియా మార్కెట్లలో ఎన్సీఎక్స్ నిఫ్టీ 17,850 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది