హైదరాబాద్ : ఏపీలోని నంద్యాల బైపాస్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు గాయపడ్డారు. ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు హైదరాబాద్కు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో సహా పదకొండు మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm