జైపూర్ : రాజస్దాన్లోని బర్మార్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్ వంటి నిషేధిత డ్రగ్స్ సేవించారని చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి ఓంప్రకాష్ విష్ణోయ్ తెలిపారు. అయితే సమాచారం అందుకున్న తర్వాత అధికారులు అక్కడికి చేరుకునే సమయానికి నిందితులు ఎవరూ లేరని చెప్పారు. విద్యార్ధులు, ఉపాధ్యాయుల స్టేట్మెంట్ నమోదు చేసుకుని నిందితుల ఆచూకీ పసిగడతామని చెప్పారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు., స్వాతంత్ర్య వేడుకలు ముగిసిన అనంతరం దాదాపు పదిమందికి పైగా పాఠశాలకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వీడియోల ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలనంతరం దాదాపు డజను మంది పాఠశాలకు చేరుకున్నారు. ఒకరికొకరు నల్లమందు, గసగసాల పొట్టు వడ్డించుకుంటూ వాటిని సేవించారు.