హైదరాబాద్ : లీటరు పాలపై రెండు రూపాయలు పెంచుతున్నట్టు అముల్ డెయిరీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు బుధవారం నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరను పెంచినట్టు సంస్థ పేర్కొంది. లీటరుపై రెండు రూపాయలు పెంచడం అంటే, ఎంఆర్పీపై రూ.4 పెరిగినట్టు అని ఆ సంస్థ తన ప్రకటనలో చెప్పింది. అహ్మదాబాద్, సౌరాష్ట్ర మార్కెట్లో అర లీటరు అముల్ గోల్డ్ పాలను రూ.31కి అమ్ముతున్నారు. అర లీటరు అముల్ తాజా రూ.25కు, అముల్ శక్తి లీటర్ పాలను రూ.28కి అమ్ముతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm