ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 379 పాయింట్లు లాభపడి 59,842కి చేరుకుంది. నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 17,825 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు గడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎన్టీపీసీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm