హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం ఉయ్యాలవాడలో భూ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన ముగ్గురు పోలీసులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో లక్ష్మీదేవిపల్లిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm