చండీగఢ్ : ఉగ్రవాదుల భారీ కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్లోని అమృత్సర్లో సబ్ ఇన్స్పెక్టర్ దిల్ బాగ్ సింగ్ కారు కింద ఇద్దరు దుండగులు ఐఈడీని పెట్టారు. కారును నడిపేందుకు వచ్చిన వ్యక్తి ఐఈడీని గమనించి దిల్ బాగ్ సింగ్కు చెప్పాడు. దాంతో ఆయన వెంటనే బాంబు స్క్వాడ్ను రప్పించగా.. వారు దానిని నిర్వీర్యం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు అగంతకులు ఆయన కారు కింద గత రాత్రి భారీ పేలుడు సామర్థ్యం ఉన్న బాంబును అమర్చినట్టు గుర్తించారు. దుండగులు తెల్లడి కుర్తాలు ధరించి, ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నట్టు తెలిసింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో దిల్ బాగ్ పనిచేస్తున్నందున ఆయనను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుని ఉండవచ్చనే కోణం నుంచి పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సువ్ ఇంజన్ స్టార్ చేయగానే బాంబు పేలేలా అగంతకులు దానిని అమర్చినట్టు వారు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm