గుంటూరు : ఈ ఏడాది ఏప్రిల్...ఆగస్ట్ తో పోల్చుకుంటే 7.3 శాతం విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. ఇదే సమయంలో 0.4 శాతం మేర విద్యుత్ కు డిమాండ్ పెరిగింది. సీఎం చంద్రబాబుకు విద్యుత్ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.16 కోట్ల ఎల్ ఈడీ బల్బుల పంపిణీ, విద్యుత్ ఆదా చేసే 2.55 లక్షల ఫ్యాన్లు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. 17,779 విద్యుత్ ఆదా ట్యూబ్ లైట్ల పంపిణీ చేశామని వివరణ ఇచ్చారు. దేశంలోనే అత్యధికంగా 15 వేల సోలార్ పంపు సెట్లు, 110 పట్టణాల్లో 5.9 లక్షల ఎల్ ఈడీ వీధి దీపాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm