రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రూ.1.95 కోట్ల పాత నోట్లను మార్పిడికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను అర్బన్ జిల్లా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ బి.రాజకుమారి వివరాలు వెల్లడించారు. తాడేపల్లిగూడెం కిష్టయ్య పాలానికి చెందిన వంగా దుర్గాశ్రీధర్, కె. ఈశ్వరరావు మరికొందరు కలిసి తమ తమ బంధువుల నుంచి సేకరించిన రూ.1.95 కోట్ల పాత రూ.500, రూ.1000 నోట్లను రెండు కార్లలో తీసుకొని మధ్యవర్తుల ద్వారా మారకం చేసేందుకు మంగళవారం రాజమహేంద్రవరం వచ్చారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న అర్బన్ జిల్లా ఏజీఎస్ పోలీసులు దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.95 కోట్ల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల రాకను గమనించిన ముఠాకు చెందిన మరో నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm