మహబూబాబాద్ : అంతర్ రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. నిందితుడి వద్ద నుంచి పోలీసులు రూ. 9 లక్షల విలువచేసే 30 తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలోనే దాదాపు 30 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. దొంగను అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరి చేసిన ఐదుగురు పోలీసులకు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి రివార్డులు అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm