కాబుల్: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మరో వైపు స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 9మంది మృతిచెందగా, దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఓ చెక్పాయింట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆటగాళ్లు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm