సూర్యపేట: నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నెలో విషాదం నెలకొంది. పురుగులమందు తాగి రైతు కృష్ణయ్య (50) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2003సం.లో ఎరువుల వ్యాపారి వద్ద కృష్ణయ్య తన పొలాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేయించారు. డబ్బులు తీసుకుని తన పొలం తనకు ఇవ్వాలని కృష్ణయ్య అన్నారు. అందుకు ఎరువుల వ్యాపారి అంగీకరించలేదు. పోలీసులు, అధికారుల అండతో ఇతరులకు పొలాన్ని విక్రయించేందుకు యత్నించారు. మనస్తాపంతో రైతు కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహంతో బంధవులు ఆందోళన చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm