న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదాలు జరిగి చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని శివాజి బ్రిడ్జి వద్ద రాంచి రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఇక.. మళ్లీ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జమ్ము రాజధాని ఎక్స్ ప్రెస్ లాస్ట్ కోచ్ పట్టాలు తప్పింది. ఇవాళ ఉదయం ఢిల్లీ రైల్వే స్టేషన్ కు ట్రైన్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే..ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm