మేడ్చల్: జిల్లాలో గత అర్థరాత్రి వర్షం భారీగా కురిసింది. జిల్లాలోని నేరేడ్మెట్, మల్కాజిగిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బండ్లచెరువు పొంగి పొర్లుతున్నది. షిర్డీ నగర్, ఈస్ట్ ఆనంద్బాగ్, వెంకటేశ్వరనగర్లో అయితే వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది. పటేల్ నగర్, దుర్గానగర్లోని ఇళ్లలోకి మురుగునీరు చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు వల్ల వచ్చే దుర్గంధం భరించలేక కాలనీవాసులు ఇళ్లపైకి ఎక్కి నిలబడుతున్నారు. దీంతో వారు సంబంధింత అధికారులను తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm