కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్లో నేడు జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఒక మత పాఠశాలలో చోటు చేసుకోవడంతో మృతుల్లో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని అనధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మృతుల్లో ఎక్కువమంది 5 నుంచి 18ఏళ్లలోపు వారే. ఈ ఘటనపై ప్రధాని నజీబ్ రజాక్ సంతాపం తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm