హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లిలో ఉన్న జేఎన్టీయూలో మెకానికల్ విభాగానికి చెందిన ఓ భవనం కుప్పకూలింది. గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల భవనం కూలిందా? లేక ఇతర కారణాల వల్ల కూలిందా? అనే దానిపై జేఎన్టీయూ అధికారులు విచారణ చేపట్టారు. భవనం పూర్తిగా నేలమట్టమయింది. ఆ భవనం పేరు పోర్టికో. విద్యార్థులెవరూ ఆ భవనంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm