హైదరాబాద్: నగరంలో గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరంలోని రోడ్లు, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జంటనగరాల్లో వర్షాల పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అగ్ని మాపక, రెవెన్యూ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఇక.. లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm