అహ్మదాబాద్: ముంబయి- అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు పనులకు నేడు ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షిజోఅబేలు శంకుస్థాపన చేశారు. వీరిద్దరు రిమోట్ ద్వారా వీరు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షింజోఅబే మాట్లాడుతూ శక్తివంతమైన జాపాన్ అనేది భారత్ సంబంధాలపై ఆధారపడి ఉంటుందని.. శక్తివంతమైన భారత్ అనేది జాపాన్తో సంబంధాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
ముంబయి-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. గతేడాది నవంబర్లో మోడీ జపాన్ పర్యటనలో భాగంగా బుల్లెట్ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. 2018లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 14,2017 10:32AM