చిక్కడపల్లి : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పోలాప్రగడ చారిటబుల్ ట్రస్ట్ (ఎస్ల్వీపీఎస్టీ) ఆధ్వర్యంలో డిగ్రీ, బీఎస్సీ, ఇంజినీరింగ్, ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ పౌకర్యంలో కల్పిస్తున్నట్లు ట్రస్ట్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి ఉదయం 10.30 గంటలకు నల్లకుంట ఎస్ఎల్ డయాగ్నస్టిక్ సెంటర్ జీసీసీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీడిమెట్ల సుచిత్రా ఎలక్ట్రానిక్స్, ఈశ్వరీపురి లేక్వ్యూ రెసిడెన్సీ కాలనీ, బీహెచ్ఈఏఎల్ రామచంద్రాపురం, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో విద్యార్థులకు హాస్టల్ వ సతి కల్పిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 95504 72190లో సంప్రదించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm