మారేడ్పల్లి : మెట్రో రైల్స్టేషన్ల వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం కోసం బస్ సర్వీసులను నడిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.పురుషోత్తం తెలిపారు. నవంబర్ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న మియాపూర్-నాగోల్ మెట్రో రూట్లలో ఆర్టీసీ అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆర్ఎంలు రమాకాంత్, పి.కొమరయ్య, డీవీఎం ఏ.శ్రీధర్, కంటోన్మెంట్ డిపో మేనేజర్ సత్యనారాయణ, డిప్యూటీ సీటీఎం జీవన్ ప్రసాధర్లతో కలిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.పురుషోత్తం పరిశీలించారు.
Mon Jan 19, 2015 06:51 pm