హైదరాబాద్ : దుర్గామాత నవరాత్రుల సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు పోలీస్ క్లియెరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 21నుంచి 30 వరకు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, అనంతరం అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పబ్లిక్ ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసే ప్రతి మండప నిర్వాహకులు విగ్రహాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు సంబంధించి ఆయా డివిజన్ ఏసీపీల నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిపికెట్ తీసుకోవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm