అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాష్ట్రమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రస్తుతం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రుణం పొందేందుకు అర్హత ఉందన్నారు. మొత్తం రూ.7వేల కోట్ల రుణానికి అర్హత ఉందని వివరించారు. కార్పొరేషన్ల రుణాలు పొందేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. వర్కర్లు, గుత్తేదారులపై 12శాతం జీఎస్టీ వల్ల ప్రభుత్వంపై రూ.700 కోట్ల భారం పడుతుందన్నారు. రైతు రుణమాఫీకి రూ.3వేలకోట్లు, డ్వాక్రా సంఘాల రుణమాఫీకి రూ.2వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm