గుంటూరు: రాజధానిలో అంబేద్కర్ స్మృతివనం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు డిజైన్లను పరిశీలించామని మంత్రి ఆనంద్బాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 19న వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో డిజైన్ల ప్రదర్శన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు, మేధావులను ఆహ్వానిస్తామని మంత్రి తెలిపారు. గుంటూరులో క్రిస్టియన్ స్మశాన వాటికల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, అడవితక్కెళ్ళపాడులో క్రిస్టియన్ భవన్కు డిజైన్లు ఫైనల్ చేశామని ఆనంద్బాబు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm