థానే : బంకుల్లోకి చొరబడి పెట్రోల్ చోరీకి పాల్పడుతున్న గ్యాంగ్ను థానే క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్ చోరీ కేసుకు సంబంధించి క్రైం బ్రాంచ్ పోలీసులు ఒక టెక్నీషియన్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముఠాతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఐదుగురు పెట్రోల్ బంకు యజమానులు, ఆరుగురు మేనేజర్లు, ఏడుగురు ప్రైవేట్ టెక్నీషియన్లు సహా మొత్తం 29మందిని అరెస్ట్ చేసినట్లు థానే క్రైం బ్రాంచ్ పోలీస్ ఉన్నతాధికారి నితిన్ థాకరే తెలిపారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో మహారాష్ట్రలో 170 పెట్రోల్ బంకులు, ఒడిశాలో 2 పెట్రోల్ బంకులపై తనిఖీలు చేపట్టనున్నట్లు నితిన్ థాకరే వెల్లడించారు
Mon Jan 19, 2015 06:51 pm