గుంటూరు: టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని గురువారం ఆర్యవైశ్యులు ముట్టడించారు. నల్ల జెండాలు, ప్లకార్డులతో పార్టీ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. తమ మనోభావాలను కించపరిచిన కంచె ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని వారికి ఏవీ రమణ హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm