హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా ఈ నెల 14 నుంచి 25 వరకు అసోం వైపు రాకపోకలు సాగించే 13 రైళ్లు రద్దయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి గువాహటి, హావ్డా(హౌరా), న్యూజల్పాయ్గురి వైపు వెళ్లే రైళ్లు ఇందులో ఉన్నాయి. 14న బెంగళూరు-హావ్డా ప్రత్యేకరైలు, 15న సికింద్రాబాద్-గువాహటి ప్రత్యేకరైలు, 17న తిరువనంతపురం-గువాహటి, 18న తాంబరం-గువాహటి, హావ్డా-బెంగళూరు కంటోన్మెంట్, 19న తిరువనంతపురం-గువాహటి, 20న కమాక్య-యశ్వంత్పూర్, 22న న్యూజల్పాయ్గురి-చెన్నై, గువాహటి-తిరువనంతపురం, గువాహటి-చెన్నై ఎగ్మోర్, 24న దిబ్రుగర్-చెన్నై ఎగ్మోర్, 25న గువాహటి-సికింద్రాబాద్ ప్రత్యేకరైలు రద్దయిన రైళ్ల జాబితాలో ఉన్నయని ద.మ.రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ బుధవారం వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm