కరీంనగర్: మూడు నెలల్లోగా మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం కరీంనగర్ లోయర్ మానేర్ జలాశయంలో చేప పిల్లల్ని మంత్రి ఈటల రాజేందర్తో కలిసి వదిలారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ... మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఈలోగా మత్స్యకారులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. అలాగే ఎంత ఖర్చయినా చేపల మార్కెట్లు నిర్మిస్తామన్నారు. కాగా... కరీంనగర్కు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతనంగా నిర్మించిన పశువైద్యశాలను ప్రారంభించి గొర్రెలను పంపిణీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm