సంగారెడ్డి: రేపటి నుంచి గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపడుతామని మంత్రి హరీశ్రావు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా జరుగుతుందన్నారు. సంగారెడ్డిలో రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సుకు మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాది వరకు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మండలానికి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ను ఏర్పాటు చేస్తమన్నారు. ప్రతీ గ్రామంలో రైతు సమావేశ మందిరాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రైతులకు శిక్షణ ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తమని, రాజకీయాలు, కుల, మతాలకతీతంగా రైతులందరికీ పెట్టుబడి అందిస్తామని పునరుద్ఘాటించారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటు దేశానికే ఆదర్శం కానుందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా రైతు సమన్వయ సమితిలు పనిచేస్తాయన్నారు. కోర్టులో కేసులు వేస్తూ కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నరని హరీశ్రావు మండిపడ్డారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm