భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బుర్గంపాడు మండలంలోని మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ద్విచక్రవాహనంను ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో టేకులపల్లి మండలం కొత్త తండాకు చెందిన భర్త వీరన్న(36) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య శారద (32) తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు భద్రాచలం వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm