చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షను నిరూపించుకోవాలని గవర్నరును కోరిన దినకరన్ వర్గం తాజాగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. అసెంబ్లీలో సీఎం తన మెజార్టీని నిరూపించుకోవాల్సిందిగా దినకరన్ వర్గం తన పిటిషన్ ద్వారా కోరింది. 'పళనిస్వామికి ఎటువంటి మెజార్టీ లేదు. ఆయన మెజార్టీని నిరూపించుకోవాల్సిందిగా గవర్నరును గతంలోనే కోరాం. కానీ దీనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. అందుకే హైకోర్టును ఆశ్రయించాం' అని దినకరన్ తెలిపారు. విచారించిన న్యాయస్థానం దినకరన్కు అండగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాల్సిందిగా తమిళనాడు అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. దీంతో పాటు సెప్టెంబరు 20 వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm