న్యూఢిల్లీ: పటిష్టమైన ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆరంభం కాకుండానే విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మూడు వన్డేలకు ఓపెనర్ శిఖర్ ధావన్ కు జట్టులో చోటు కల్పించినప్పటికీ, అతన్ని ఉన్నపళంగా జట్టు నుంచి విడుదల చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. తన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో జట్టు నుంచి రిలీజ్ చేయమని విన్నవించిన కారణంగానే ధావన్ ను రిలీజ్ చేస్తున్నట్లు బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అయితే అతని స్థానంలో మరే ఇతర క్రికెటర్ ని ఇంకా ఎంపిక చేయలేదు.
Mon Jan 19, 2015 06:51 pm