హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 3వేల కోట్ల రుణం లభించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకునేందుకు సాగునీటిపారుదల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా... ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఇరిగేషన్ బోర్డుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm