హైదరాబాద్: తెలంగాణ లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె బాట పట్టారు. హైదరాబాద్: లేబర్ ఆఫీస్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీంతో లేబర్ ఆఫీసు గేటుకు అధికారులు తాళాలు వేశారు. లేబర్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈ ఎస్ ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాల అమలుకు వారు డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm