తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి లైసెన్స్ లభించింది. ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదానికి లైసెన్స్ లభించింది. గతంలో లడ్డూ ప్రసాదాల నాణ్యతను ప్రశ్నిస్తూ ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐకి ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. లడ్డూ తయారీ ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన అధికారులను టిటిడి అనుమతించలేదు. తాజాగా ఫుడ్ సేప్టీ నుంచి టిటిడి లైసెన్స్ పొందింది.
Mon Jan 19, 2015 06:51 pm