చెన్నై : బాలీవుడ్ ప్రముఖ నటి, అందాల సుందరి సుస్మితాసేన్ చెన్నైలోని ప్రత్యేక కోర్టుకు వచ్చారు. ఓ కేసు విచారణలో భాగంగానే ఈ సుందరి కోర్టుకు వచ్చింది. సుస్మితాసేన్ విదేశీ వర్తక విధానాన్ని ఉల్లంఘించి విలాసవంతమైన కారును విదేశాల నుంచి పన్ను చెల్లించకుండా దిగుమతి చేసుకున్నారని కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు పెట్టిన కేసు విచారణలో భాగంగా చెన్నై ప్రత్యేక కోర్టు ఆమెకు వారంట్ జారీ చేసింది. సుస్మితాసేన్ 2004 మెడల్ కారును కొని తప్పుగా 1998 మోడల్ అని పేర్కొంటూ కారును కస్టమ్స్ డ్యూటీని ఎగవేస్తూ విదేశాల నుంచి తెప్పించిందని కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో చెన్నై ప్రత్యేక కోర్టు ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. సుస్మితాసేన్ కోర్టుకు రావడంతో ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm