బోయినపల్లి: రాజన్న జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక అడ్డరోడ్డులోని మానేరు ఫ్లాష్ బ్రిక్స్ తయారీ కేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆపిల్(2) అనే బాలుడు టిప్పర్ వెనుక టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రాజు, తిరుమల దంపతులు ఫ్లాష్బ్రిక్స్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు ఆపిల్ ఇసుక కుప్పలపై ఆడుకుంటూ టిప్పర్ వెనుక టైర్ కింద పడి మృతిచెందాడు. కాని డ్రైవర్ అజాగ్రత్తవల్లే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm