కర్నూలు: ఒక సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్న వ్యక్తి కైలాష్ సత్యార్థి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశంలో ఐదుగురికి నోబెల్ బహుమతి వచ్చిందని, అందులో కైలాష్ సత్యార్థి ఉండటం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో పిల్లలకు స్వేచ్ఛ వచ్చేంత వరకు పని చేస్తానని చంద్రబాబు అన్నారు. సమాజంలో పిల్లల సంరక్షణ కోసం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీఎం సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm